కాషాయీకరణ కుట్రకు నాంది

  •  దూరదర్శన్‌ రంగు మార్పుపై స్టాలిన్‌ ఆగ్రహం

చెన్నై : దూరదర్శన్‌ లోగోను కాషాయ రంగులోకి మార్చడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతీ అంశాన్ని కాషాయీకరణ చేసే కుట్రకు నాందిగా దీనిని ఆయన విమర్శించారు. ‘తమిళపదం ‘వానోలి’ స్థానంలో ఇదివరకే ‘ఆకాశవాణి’గా బిజెపి మార్పు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే రీతిలో కాషాయ రంగులద్దారు. కేంద్రంలోని ఫాసిస్టు పార్టీ అహంకారానికి ప్రతీక’ అని స్టాలిన్‌ అన్నారు. దేశ ప్రజానీకం అంతా సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారని, వచ్చే జూన్‌ 4న బిజెపి ఘోర పరాభవాన్ని రుచిచూస్తుందని పేర్కొన్నారు.

➡️