కుల్గాంలో ముగిసిన ఆపరేషన్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్‌ గురువారం ఉదయం ముగిసినట్టు తెలిపింది. అంతకుముందు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం బుధవారం అర్ధరాత్రి మరొక ఉగ్రవాదిని కాల్చిచంపినట్టు పేర్కొంది. ‘కుల్గాంలోని రెడ్‌వానీ పయీన్‌లోని సాధారణ ప్రాంతంలో మే 06 న ప్రారంభమైన జాయింట్‌ ఆపరేషన్‌.. దాదాపు 40 గంటల పాలు కొనసాగింది. ఇందులో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించాం’ అని భారత్‌ సైన్యం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

➡️