ప్రజాశక్తి-కడప : సిఎం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో కొనసాగుతుంది. నైట్హాల్ట్ పాయింట్ వద్ద సీఎం జగన్ను ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైసిపి నేతలు కలిశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వైసిపి నుంచి టిడిపిలోకి చేరారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిల భారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ, టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్ రెడ్డ్యం వెంకట సుబ్బారెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్ పంచాయితీ మాజీ సర్పంచ్ వీఎస్ కష్ణమూరి వైసిపిలో చేరారు. అనంతరం నల్లగట్ల, బత్తలూరు మీదుగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎర్రగుంట్లకు చేరుకుంది. అక్కడి ప్రజలతో సిఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు.