హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలని.. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. శాసనమండలిలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టను గత ప్రభుత్వం సాగునీటి కోసం వినియోగించకుండా.. పర్యాటకంగా వాడుకుందని ఆరోపించారు.”మిషన్ భగీరథ పథకం కూడా కమీషన్ల ప్రాజెక్టే. అన్ని వసతులు ఉన్నా, రామగుండం కాదని యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టారు. విద్యుత్ విభాగంలో ?80,000ల కోట్ల అప్పులు ఉన్నాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథపై విచారణ జరిపించాలి. ఐటీఐఆర్ ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం అంటోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలి. కేంద్రం వివక్ష వల్ల జాతీయ హోదా సాధించలేకపోయాం. కఅష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకోవాలి. కఅష్ణా జలాలు కాపాడుకోవడంలో గత ప్రభుత్వం తరహాలో ఉదాసీనత తగదు. సాగు నీరు హక్కులు కాపాడటంలో కేసీఆర్ విఫలమయ్యారు. కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారు” అని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/1-50.jpg)