- సీనియర్లకు దక్కని చోటు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పొత్తులో భాగంగా టిడిపి 144 సీట్లలో పోటీ చేయనుంది. ఇప్పటి వరకు 128 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మరో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిల్లో కొన్ని పొత్తులో భాగంగా ముడిపడి ఉన్నాయి. మరికొన్ని నేతల మధ్య పోటీ ఉండటంతో వెల్లడించడం లేదు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్ నేతలకు ఈ జాబితాలోనూ చోటు దక్కలేదు. తమ పార్టీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఎక్స్ (ట్విట్టర్)లో కోరారు.
అభ్యర్థుల జాబితా ఇదే!
- నరసన్నపేట – బొగ్గు రమణ మూర్తి
- గాజువాక – పల్లా శ్రీనివాసరావు
- చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు
- మాడుగుల – పైలా ప్రసాద్
- ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
- రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్
- రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- రంపచోడవరం – మిర్యాల శిరీష
- కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు
- దెందులూరు – చింతమనేని ప్రభాకర్
- గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
- పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్
- గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి
- గుంటూరు ఈస్ట్ – మహ్మద్ నజీర్
- గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
- కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
- మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
- గిద్దలూరు – అశోక్ రెడ్డి
- ఆత్మకూరు – ఆనం రాంనారాయణ రెడ్డి
- కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
- వెంకటగిరి – కురుగొండ్ల లక్ష్మీప్రియ
- కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
- ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
- నందికొట్కూరు (ఎస్సీ) – గిత్తా జయసూర్య
- ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
- మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
- పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
- కదిరి- కందికుంట యశోదా దేవి
- మదనపల్లి- షాజహాన్ బాషా
- పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
- చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
- శ్రీకాళహస్తి- బజ్జల వెంకట సుధీర్ రెడ్డి
- సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
- పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళీ మోహన్