తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.శుక్రవారం స్వామివారిని 62,593 మంది యాత్రికులు దర్శించుకోగా 18,517 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.31 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

➡️