తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ..

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తిరుమలకు చేరుకున్నారు. టోకెన్లు ఉన్న యాత్రికులకు కొద్ది నిమిషాల్లోనే దర్శనం అవుతుండగా టోకెన్లు లేని యాత్రికులకు8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శుక్రవారం 77,483 మంది యాత్రికులు దర్శించుకోగా 19,276 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3 కోట్లు వచ్చిందన్నారు.

➡️