నేడు విశాఖలో తెలంగాణ సిఎం పర్యటన

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఆయన తన పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 4:15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 05:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి 05:30 గంటలకు స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్న తృష్ణ గ్రౌండ్ కి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మరల 07:00 గంటలకు అక్కడి నుండి బయలుదేరి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అనంతరం 07:15 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి పయనమవుతారు. ఇదిలా ఉండగా తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు.

➡️