Train: మార్చి 12 నుంచి 22 వరకు రైళ్ల రాకపోకలలో మార్పులు

Mar 10,2024 11:46 #cancle, #hydrabad, #special trains

ప్రజాశక్తి-హైదరాబాద్ : ఈ నెల 12 నుంచి 22 వరకు వివిధ స్టేషన్ల మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12, 15, 16, 19 తేదీలలో కాచిగూడ, మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్లు షాద్ నగర్ మీదుగా వెళ్లవని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా వాటిని వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 20న హౌరా- శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా నడిపిస్తున్నట్లు చెప్పారు. డోన్, గుత్తి స్టేషన్ల స్టాప్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 22న శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం – హౌరా, పూరి – యశ్వంత్పూర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను గుత్తి ఫోర్ట్, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా మళ్లించినట్లు తెలిపారు.

➡️