ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు -ఇద్దరు మావోయిస్టులు మృతి

Mar 23,2024 21:37 #alluri, #firings, #mavoist

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్‌ ఎస్‌పి జితేంద్ర కుమార్‌ కథనం ప్రకారం… బీజాపూర్‌లోని పిడియ అటవీ ప్రాంతంలో బీజాపూర్‌, సుక్మా, దంతెవాడలకు చెందిన డిఆర్‌జి, బస్తర్‌ ఫైటర్‌, కోబ్రా దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టుల మృతదేహాలను తరలించే సమయంలో అప్పటికే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఇద్దరు పోలీసులు (బస్తర్‌ ఫైటర్లు)కు గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్‌లో రాయపూర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఆపరేషన్‌లో దంతెవాడ ఎస్‌పి గౌరవ్‌ రాయ్, సుక్మా ఎస్‌పి కిరణ్‌ శహ్వాన్‌ పాల్గొన్నారు.

➡️