హైదరాబాద్ : రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు నమోదయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో లైమ్లైట్ గార్డెన్ వద్ద ఫిల్మ్ సిటీ విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను నిందితుడిగా చేర్చారు. చనిపోయింది విస్టెక్స్ కంపెనీ సిఇఒ సంజరు షాగా పోలీసులు నిర్థారించారు. మఅతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇక కంపెనీ సిఇఒ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన్ని మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎఫ్ఐఆర్ ప్రకారం.. జానకీరాం రాజు అనే ప్రైవేట్ ఉద్యోగి ఈ ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిగా రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ను చేర్చి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.