శ్రీవారి దర్శనానికి ఫిబ్రవరి నెల కోటా విడుదల.. గంట వ్యవధిలోనే టికెట్లు పూర్తి

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఫిబ్రవరి-2024 నెలలో దర్శించుకునేందుకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు గంటల్లోపే పూర్తయ్యాయి. ప్రతి నెలవారీ కోటాను టీటీడీ 24,25 వ తేదీల్లో విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి కోటాను దక్కించుకునేందుకు యాత్రికులు పోటాపోటి పడ్డారు.చాలా సేపు సర్వర్‌ బిజీ రావడంతో కొందరు యాత్రికులు దర్శన టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో కుస్తీ పడ్డారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్‌ కూడా అరగంటలోనే పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు బస చేసేందుకు కొండపై ఉన్న వసతి గదులతో పాటు తిరుపతిలోని వసతి గఅహాల స్లాట్‌ను విడుదల చేసింది.

➡️