2018 గ్రూప్‌-1 వారికి ఎన్నికల విధులు వద్దు : ఎన్నికల ప్రధాన అధికారికి టిడిపి లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హైకోర్టు తీర్పు నేపధ్యంలో 2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా నియామకమైన వారికి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు గురువారం లేఖ రాశారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై హైకోర్టు ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కొంతమంది ఆర్‌డివోలుగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం వారు విధుల్లో కొనసాగించడానికి వీలు లేదని తెలిపారు. చిత్తూరు జిల్లా టిడిపి నేత పులవర్తి నాని సతీమణిపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మరో లేఖ రాశారు. ఎన్నికల అవకతవకలపై అందిన 49ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మరో లేఖ రాశారు.

➡️