- రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోటీ
ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్లు పరిశీలన ఉపసంహరణ అనంతరం 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు జంజనం పద్మ , మురుగుడు సత్యం లు ఉపసంహరించినట్లుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జి రాజాకుమారి తెలిపారు. రంగంలో ఉన్న 40 మంది అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం లో 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రత్యేకించి వీరి కోసం మూడు ఈవీఎం బ్యాలెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్దులు టిడిపి కూటమి నుండి నారా లోకేష్, వైసిపి నుండి మురుగుడు లావణ్య, ఇండియావేదిక బలపరచిన అభ్యర్థి సిపిఎం నుండి జొన్నా శివశంకర్ పోటీలో ఉన్నారు.