- టిడిపి బహిష్కరణ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : శాసనసభ సమావేశాలను 8 వ తేది వరకు (నాలుగు రోజులు) నిర్వహించాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సభ్యులు బహిష్కరించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో శాసనసభాపక్షనేత జగన్మోహన్రెడ్డి, సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్, మంత్రులు పెద్దిరెడ్డి, జోగి రమేష్, విప్ ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోతేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, ఏడోతేదీన ఓన్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎనిమిదోతేదీన దీనిపై చర్చించి ఆమోదం తీసుకోనున్నారు. తొలుత మూడు రోజులు జరపాలని అనుకున్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో ఒకరోజు పొడిగించినట్టు అధికారపక్ష సభ్యులు తెలిపారు. ఏడోతేదీ ఉదయం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఓన్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.