రూ. తొమ్మిది లక్షల నగదు పట్టివేత

ప్రజాశక్తి – డెంకాడ :ఎన్నికల నియమావళికి విరుద్ధుంగా తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని మోదవలస చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. విశాఖ నుంచి ఒడిశా వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేశారు. కారులోని రూ. తొమ్మిది లక్షల నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలను యజమాని చూపించకపోవడంతో కేసు నమోదు చేశారు.

➡️