గుండెపోటుతో 14 ఏళ్ల విద్యార్థి మృతి

Mar 27,2024 16:43 #death, #heart attack, #Telangana

హైదరాబాద్‌ :  14 ఏళ్ల ఓ విద్యార్థి మృతి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లాలోని కందికట్కూర్‌ గ్రామనికి చెందిన సాయితేజ గుండె పోటుతో పాఠశాలలోనే కుప్పకూలి చనిపోయాడు. కాగా సాయితేజకు పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉందని.. ఆపరేషన్‌ తప్పనిసరిగా చేయించాలని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, డబ్బులు లేక తల్లిదండ్రులు ఆపరేషన్‌ చేయించలేకపోయారని..ఈ క్రమంలో మంగళవారం బడికి వెళ్లిన సాయితేజ.. గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని స్థానికులు తెలిపారు.

➡️