నెల్లూరు : ఆలయం వద్ద ఆడుతూ కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు … నెల్లూరు నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా, అమ్ము దంపతులకు కరిష్మా, కాలేషా (2) పిల్లలున్నారు. కరిముల్లా చికెన్ దుకాణంలో, అమ్ములు చేపల దుకాణంలో పనిచేస్తూ జీవిస్తున్నారు. ఈ నెల 7న సాయంత్రం అమ్ములు ఇరుగాళమ్మ ఆలయం వద్ద పనిచేస్తుండగా.. కాలేషా అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ పెట్రోల్ బాటిల్ను చూసి కూల్డ్రింక్ అనుకొని తాగాడు. వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయాన్ని గుర్తించిన తల్లి.. బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మఅతి చెందాడు. బాధిత తల్లిదండ్రులు చిన్నబజారు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.