ప్రజాశక్తి- అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 8 వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. బిఎసి సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.