14 వరకు అవకాశం
ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఎపిసెట్ 2024) దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించినట్లు ఎపిసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య జిఎంజె.రాజు ఒక ప్రకటనలో బుధవారం పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి దరఖాస్తు గడువును పొడిగించామని, ఎటుంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రూ.రెండు వేల అపరాధ రుసుముతో మార్చి 25 వరకు, రూ.ఐదు వేల అపరాధ రుసుముతో ఏప్రియల్ ఐదు వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు. ఎపిసెట్ ప్రవేశ పరీక్షను 30 సబ్జెక్టులతో ఏప్రిల్ 28న రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది రీజినల్ కేంద్రాల పరిధిలో నిర్వహిస్తామని తెలిపారు.