విశాఖపట్నం జిల్లాకు ఎన్నికల పరిశీలకుల నియామకం

ప్రజాశక్తి-విశాఖ : వైసిపి పార్టీ అధ్యక్షులు, సిఎం జగన్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ద్రోణంరాజు శ్రీవాత్సవ్‌, విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి చొక్కాకుల వెంకట్రావు , బాణాల శ్రీనివాస్‌ రావు, విశాఖ పశ్చిమం నియోజకవర్గానికి ఎస్‌.ఎ.రెహ్మన్‌తో పాటుగా పీలా ఉమారాణి , పెడాడ రమణి కుమారి. గాజువాక నియోజక వర్గానికి ఐ.హెచ్‌.ఫరూఖీని నియమించారు.

➡️