సింగరేణి : సింగరేణి సంస్థకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐఆర్ఎస్ అధికారి అయిన బలరాం నాయక్ ప్రస్తుతం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఫైనాన్స్తో పాటు వెల్ఫేర్ బాధ్యతలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. వీటితో పాటు సీఎండీగా అదనపు బాధ్యతలను బలరాం నాయక్ స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న సీఎండీ ఎన్.శ్రీధర్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని సూచించింది.