ప్రజాశక్తి-అమరావతి : ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత కింద నిధుల విడుదలను ఈసీ అడ్డుకోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ కింద హైకోర్టు ఈ పిటిషన్ను విచారణ చేయనుంది. లబ్ధిదారుల పిటిషన్పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.