ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆళ్లగడ్డ బిజెపి నియోజక ఇన్ఛార్జి భూమా కిశోర్రెడ్డి వైసిపిలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో భూమా కిశోర్రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. భూమా కిశోర్రెడ్డితోపాటు ఆళ్లగడ్డ బిజెపి నాయకులు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి తదితరులు వైసిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసిపి రీజనల్ కో-ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, నంద్యాల ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, పాల డెయిరీ ఛైర్మన్ ఎస్వి జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.