వైసిపి అరాచకాలు పెచ్చుమీరాయి – ‘నిజం గెలవాలి’లో భువనేశ్వరి

Mar 26,2024 21:55 #Eluru district, #nara bhuvaneswari

ప్రజాశక్తి – కొయ్యలగూడెం :వైసిపి ప్రభుత్వ అరాచకాలు పెచ్చుమీరాయని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. ప్రజల కోసం అనేక సంక్షేమం పథకాలను చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు. అటువంటి మనిషిపై అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైల్లో నిర్బంధించారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాదును హైటెక్‌ సిటీగా మార్చారని గుర్తు చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. యర్రంపేటకు చెందిన చాండ్ర కన్నయ్య భార్య రత్తమ్మను పరామర్శించి, రూ. మూడు లక్షల చెక్కును అందజేశారు. దిర్సిపో వెంకటలక్ష్మి కుటుంబాన్ని, బయ్యనగూడెంలో మార్గాని వెంకటేశు కుటుంబాన్ని, పేరంపేటలో భీమడోలు లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం చెక్కులను అందజేశారు.

➡️