గంటలో 4.53 లక్షల టోకెన్ల బుకింగ్‌

Dec 26,2023 08:47 #tirumala tirupathi temple, #ttd
  • శ్రీవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి పెరిగిన డిమాండ్‌

ప్రజాశక్తి -తిరుమల : మార్చి నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి టిటిడి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 4. 53 లక్షల టోకెన్లు 1.08 గంటలకు అమ్ముడుపోయాయి. దీంతో మార్చి నెలకు సంబంధించి టోకెన్ల విక్రయాల ద్వారా రూ. 15 కోట్లకు పైగా టిటిడికి ఆదాయం లభించింది. అద్దెగదులకు సంబంధించి మధ్యాహ్నం మూడుగంటలకు బుకింగ్‌ విడుదల చేయగా..గంట వ్యవధిలో యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

➡️