విరిగిన రైలు పట్టా : తప్పిన పెను ప్రమాదం

పూతలపట్టు (తిరుపతి) : ఘోర రైలు ప్రమాదం తప్పిన ఘటన సోమవారం తిరుపతి జిల్లాలో జరిగింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది. ముందుగా రైలు పట్టా విరిగినట్టు గ్యాంగ్‌ మేన్‌ గుర్తించి వెంటనే విషయాన్ని అధికారులకు తెలిపారు. దీంతో.. అప్రమత్తమైన అధికారులు రామేశ్వరం నుంచి వస్తున్న రైలును వెంటనే ఆపేశారు. రైలు పట్టాలకు మరమ్మతులు చేసి యథావిథిగా రైళ్లను నడుపుతున్నారు. రైలు పట్టా మరమ్మతుల కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా రైలు పాకాలకు చేరుకుంది ప్రస్తుతానికి ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

➡️