జొన్న శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

Apr 19,2024 17:52

ప్రజాశక్తి-తాడేపల్లి
ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారంనాడు తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిపిఎం కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. కె.ఎల్‌ రావు కాలనీ, రామయ్య కాలనీ, బ్రహ్మానందపురం ప్రాంతాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, నాయకులు వేముల దుర్గారావు, బాషా, ఏసిపోగు శాస్త్రి, ఎమ్మెల నర్శింహరావు, నీరుడు దుర్గారావు, కోట బాబూరావు, దర్శినపు విజరుబాబు, కట్టా మేరీ, వేంపాటి సామ్యేల్‌ తదితరులు పాల్గన్నారు.

➡️