విశాఖ చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ

Dec 20,2023 13:17 #sabha, #yuvagalam padayatra

ప్రజాశక్తి-విశాఖ: టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం ‘యువగళం- నవశకం’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభ కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకునేలా వివిధ మార్గాలను నిర్దేశించింది. ఈ సభలో పాల్గొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. వారికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ సభలో పాల్గొనున్న విషయం తెలిందే..

➡️