ప్రజాశక్తి-విజయవాడ: వైసిపి నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్, వైఎస్ భారతిలు ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు.