అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెంకు వెళ్లనున్నారు. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంకు వెళ్లి బాధితులతో మాట్లాడనున్నారు. తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. అనంతరం బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సిఎం జగన్ సమావేశం కానున్నారు.