తెలంగాణ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని … సిఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ట్యాంక్బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.