హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారని తెలిపారు. 2009లోనూ డీఎస్ సారధ్యంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారని.. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని తెలిపారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని.. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/revanth-reddy-1.jpg)