హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం తన అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్నోట్ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.