సిపిఎం చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి గృహనిర్బంధం

ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : సిపిఎం చిలకలూరిపేట పట్టణ కార్యదర్శి పి వెంకటేశ్వర్లును పోలీసులు ఆదివారం గృహ నిర్బంధం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని బొప్పూడిలో టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభ నేపథ్యంలో ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిర్బంధించారు. ఎన్నికల కోడ్‌ వచ్చినా తమను ఇలా నిర్బంధించడం సరికాదని వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలును విస్మరించిన ప్రధాని మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, పైగా విశాఖ ఉక్కునూ అమ్మాలని చూస్తున్నారని విమర్శించారు. మరోవైపు సిఎఎను తెచ్చి ఎన్నికల్లో మత ప్రాతిపదికన లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేనకూ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.

➡️