ప్రజాశక్తి-విజయవాడ : కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా, రాష్ట్రాల హక్కులకై సాగుతున్న పోరాటానికి సంఫీుభావంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ మరియు ఇతర నేతలు పాల్గొని ప్రసంగించారు.