– రేపు బైటమంజులూరులో అంత్యక్రియలు
ప్రజాశక్తి-పంగులూరు (బాపట్ల జిల్లా) :సిపిఎం అభిమాని జన్నలగడ్డ వీరంరాజు (70) శుక్రవారం మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చికిత్స పొందుతూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరంరాజు చిన్నప్పటి నుంచి వామపక్ష భావజాలం కలవారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలం బైటమంజులూరు గ్రామం ఆయన స్వగ్రామం. వీరంరాజుకు భార్య వెంకటరమణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె పద్మ.. ప్రజాశక్తి దినపత్రిక ‘స్నేహ’ డెస్క్లో సబ్ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు. పద్మ భర్త అనీల్ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. శనివారం బైటమంజులూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వీరంరాజు మృతికి ప్రజాశక్తి ఎడిటర్ బి. తులసీదాస్, సిజిఎం వై. అచ్యుతరావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.