తుఫాన్ ప్రభావంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రెస్ మీట్(లైవ్)

cpm press meet on cyclone effect

ప్రజాశక్తి-విజయవాడ : మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంపై సిపిఎం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిందని అన్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, రాష్ట్ర కమిటీ సభ్యులు హరిబాబు పాల్గొని మాట్లాడారు.

➡️