Crime:చేబ్రోలులో జంట హత్యలు

Mar 20,2024 21:43 #enquiry, #Hatya, #Kakinada, #police

– వివాహేతర సంబంధమే కారణం?

ప్రజాశక్తి – పిఠాపురం (కాకినాడ జిల్లా):కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బుధవారం జంటహత్యలు కలకలర రేపాయి. వివాహతర సంబంధమే ఈ ఘటనకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చేబ్రోలుకు చెందిన పి లోవమ్మ (35) భర్తతో విభేదాల వల్ల విడిపోయి వ్యవసాయ కార్మికురాలిగా ఉంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వివాహితుడు ఎల్‌ నాగబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల కాలంలో స్థానిక రైతు పి శ్రీను (45)తోనూ ఆమె పరిచయం పెంచుకున్నారు. ఈ విషయంలో నాగబాబు, లోవమ్మల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో ఉన్న శ్రీను పొలంలో పనికి లోవమ్మ వెళ్లారు. విషయం తెలుసుకున్న నాగబాబు లక్ష్మీపురం వచ్చి పొలంలో ఉన్న లోవమ్మ, శ్రీనులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో శ్రీను, లోవమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని డిఎస్‌పి హనుమంతరావు, సిఐ శ్రీనివాస్‌ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

➡️