పట్టాలు తప్పిన గూడ్స్‌.. తప్పిన పెను ప్రమాదం

Jan 23,2024 08:10 #Prakasam District, #Train Accident

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగింది. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఖాళీ గూడ్స్‌ రైలు వెనుక రెెండు బోగీల మధ్య సమస్య ఉందని గ్రహించిన డ్రైవర్‌.. మెయిన్‌ లైన్‌లో వెళ్లాల్సిన రైలును శింగరాయకొండ వద్దకు రాగానే లూప్‌ లైన్లోకి మార్చాడు. మార్చిన వెంటనే గూడ్స్‌ రైలు లూప్‌ లైన్లో పట్టాలు తప్పింది. మెయిన్‌ లైన్లో పట్టాలు తప్పి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని, రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు జరిగి ఉండేవని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరమ్మతులు చేసినప్పటికీ చీకటి పడడంతో గూడ్స్‌ రైలును నిలిపివేశారు.

➡️