హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్కు (డీఎస్) అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేపు(ఆదివారం) నిజామాబాద్లో డీ.శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు డీఎస్ పెద్ద కొడుకు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజరు తెలిపారు. డీఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపి కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/ds-and-cm-revanth.jpg)