అమరావతి : పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల కమిషన్ (ఇసి) శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామక జాబితాను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్లు తమ వివరాలు సమర్పించాల్సి వుంటుందని తెలిపింది. ఏజెంట్లను అభ్యర్థి సర్టిఫై చేయాల్సి వుంటుందని స్పష్టం చేసింది.