‘వార్షిక నేరాల’పై వివరణ : బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాపట్ల : ‘వార్షిక నేరాల’పై మంగళవారం ఉదయం బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడారు. అనంతరం జిల్లా పోలీసు క్యాలెండర్‌ను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆవిష్కరించారు.

ఎస్పీ మాట్లాడుతూ …. పోలీసు డిపార్ట్‌మెంట్‌ 2023 లో చేసిన పనులను వివరించారు. గతంలో కంటే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కిడ్నాప్‌, మర్డర్‌ లు 23 శాతం మేర తగ్గాయన్నారు. దొంగతనం 70 శాతం మేర తగ్గిందని తెలిపారు. రాత్రి పూట పోలీసు సిబ్బంది బీట్‌ లు పెంచడం కోసం పాత నేరస్తుల పై నిఘా పెంచడం వల్ల సాధ్యమైందని చెప్పారు. చీటింగ్‌ కేసులు తగ్గాయని అన్నారు. దొంగతనాలు తగ్గాయని, రికవరీ శాతం పెరిగిందని అన్నారు. 2023 లో 70 శాతం డిస్పోజ్‌ చేశామన్నారు. దిశా యాప్‌ వాడకం వల్ల నేరాలు తగ్గాయని, మహిళా పోలీసులతో దిశా యాప్‌ డౌన్లోడ్‌ చేయించి అవగాహన కల్పించామన్నారు. గంజాయి మీద మొదటి నుంచి తీవ్రంగా పరిగణించి అదుపుచేయగలిగామన్నారు. గంజాయి మీద 5 పిడి యాక్ట్‌ లు పెట్టామన్నారు. గంజాయి మీద ప్రత్యేకంగా సంకల్పం అనే ప్రోగ్రామ్‌ ను ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, కళాశాలలో అవగాహన కల్పించామన్నారు. డ్రంక్‌ అని అండ్‌ డ్రైవ్‌ కేసులను నమోదు చేయడం వల్ల రోడ్డు యాక్సిడెంట్స్‌ తగ్గాయన్నారు. రౌడీ షీటర్‌ లపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రతి వారం పోలీసు స్టేషన్‌ కు వచ్చి వెళ్ళేలా చేసి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించామని తెలిపారు. కోర్టు కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి నిందితులకు శిక్షలు పడేలా చేయగలిగామన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలు అదుపుచేసి వారికి పునరావాసం కల్పించామన్నారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది సమిష్టి భాగస్వామ్యంతో నేరాల సంఖ్య తగ్గించగలిగామన్నారు.

➡️