ప్రేమ జంట ఆత్మహత్య

  • పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక బలవన్మరణం
  • వివాహేతర సంబంధంతో మరో జంట మృతి

ప్రజాశక్తి -మార్కాపురం రూరల్‌ (ప్రకాశం) : పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోగా, వివాహేతర సంబంధంతో మరో జంట మృతి చెందారు. ఈ రెండు సంఘటనలు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో శనివారం చోటు చేసుకున్నాయి.
పోలీసుల వివరాల మేరకు.. పిచ్చిగుంటపల్లి గ్రామానికి చెందిన నారు వెంకట నాగేశ్వరి(19), అదే గ్రామానికి చెందిన వలంటీర్‌ జక్కుల గోపి(25) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి తరుపు కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో నాగేశ్వరికి మరో యువకుడితో వివాహం కుదిర్చారు. పెద్దలు నిశ్చయించిన యువకుడితో పెళ్లి ఇష్టం లేని నాగేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పెద్దలను ఎదిరించి కలిసి జీవించలేమని భావించి ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
పెద్దారవీడు మండలంలోని పుచ్చకాయలపల్లికి చెందిన కొమ్ముసాని పోలిరెడ్డికి మాల్యవంతునిపాడు గ్రామానికి చెందిన విజయలక్ష్మి (40)కి, అదే గ్రామానికి చెందిన వలంటీర్‌ పోతిరెడ్డి సత్యనారాయణరెడ్డి(30)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. పెద్దలు మందలించడంతో గ్రామ శివారులో విజయలక్ష్మి, సత్యనారాయణరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

➡️