అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న నేపథ్యంలో … నారాలోకేష్ను వాజీ చానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినీడి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. తొండంగి మండలం ఒంటిమామిడి జంక్షన్లో కలిసి ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను నారాలోకేష్కు అందచేశారు.