ప్రజాశక్తి-చోడవరం : అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో శనివారం ఉదయం 260 కేజీల గంజాయి స్థానిక పోలీసులకి పట్టుబడింది. గంజాయితోపాటు రవాణాకు వినియోగిస్తున్న వాహనాన్ని పోలీసులు స్టేషన్కు తరలించారు. గంజాయి తరలింపులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వివరాలు సమగ్రంగా తెలియవలసి ఉంది. గంజాయి విలువ 13 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/260-kg-of-ganja-seized.jpg)