ప్రజాశక్తి-బూర్జ : శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించి సాఫ్ యజమాని బొడ్డేపల్లి హరిబాబు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో నున్న శ్రీలక్ష్మి జ్యువెలర్స్ ఆదివారం నాడు రాత్రి తమ వ్యాపారం ముగించుకొని వెళ్లామని చెప్పారు. అయితే సోమవారం ఉదయం యధావిధిగా షాపు తెరిచి చూసేటప్పటికి షాపు లూటీ అయినట్లు గుర్తించమని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు షాపు వెనుక భాగము నుండి లోపలికి ప్రవేశించి షాపులో ఉన్న 60 కేజీల వెండితో పాటు పది గ్రాములు బంగారం, 20 వేల రూపాయలు నగదు దోచుకుపోయారని హరిబాబు తెలిపారు. చోరీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై ఆముదాలవలస సిఐ దయాకర్ యాదవ్ వచ్చి పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీం వసుందని ఆయన తెలిపారు. సుమారు 30 లక్షల రూపాయలు వరకు విలువ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రశాంతంగా ఉన్న సరుబుజ్జిలిలో బంగారం దుకాణంలో లూటీ జరగడంతో స్థానికల్లో భయాందోళనలకు గురవుతున్నారు.