బాపట్ల : పర్చూరు నియోజకవర్గ వైసిపి మాజీ ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్ వైసిపికి గుడ్ బై చెప్పారు. దర్శిలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరిక మేరకు ఆమెకు తోడుగా ఉండేందుకు తాను దర్శికి వెళుతున్నట్లు భరత్ సోమవారం ప్రకటించారు. దర్శి లో తన సోదరి విజయం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.