- న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది : ఎంపి అవినాష్
ప్రజాశక్తి – కడప : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన పాత్ర లేదని కడప ఎంపి వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. కడప జిల్లా ఆలంఖాన్పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. ఎవరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా, నిందారోపణలు మోపినా నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. తన సోదరీమణులు సునీత, షర్మిలాలు ఏ విధంగా తనపై నిందలు మోపుతారని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రల్లో పడి వారు ఇలా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసులో పూర్తిగా తప్పుడు విచారణ జరుగుతోందని ఆరోపించారు. హత్య జరిగిన రోజు లోకల్ సిఐకు తానే ఫోన్ చేసి చెప్పానన్నారు. నలుగురు నిందితులూ వివేకాకు సన్నిహితులే అని చెప్పారు. గూగుల్ టెక్ ఓవర్పై గూగులే నిర్ధారణ చేయలేకపోతోందని తెలిపారు. దస్తగిరి ఎవరో చెప్పిన నిందలను నమ్మి తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.