పేదల పక్షపాతి జగన్‌ : రావెల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచిపోయారని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. జగన్‌పై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను జగన్‌ తెచ్చారన్నారు. డిఎస్‌సిపై మరోసారి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వడ్డెర్లకు సిఎం జగన్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని ఆ సంఘం జాతీయ అధ్యక్షులు తన్నీరు ధర్మరాజు అన్నారు.

➡️